పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని కలిసిన సేవల్యాపురం ప్రజలు 

 శావల్యాపురం మండలం గుర్రంవారిపాలెం గ్రామం నుండి సుమారు 50 మంది గ్రామస్తులు శావల్యాపురం మండల బిజెపి పార్టీ అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని కలిసి గ్రామ సమస్యలను దరఖాస్తు రూపంలో ఇవ్వడం జరిగింది, దీనికి మాధవ్ గారు స్పందిస్తూ తప్పకుండా మీ యొక్క కొత్తలూరు వెళ్లేటువంటి రోడ్డు మార్గం, అలాగే ఉపాధి హామీ పని కల్పించడం ఉపాధి హామీ కి సంబంధించి నిధులు జమ చేయటం, అలాగే ఊరికి పడమర వైపు ఉన్న పొలాలకు వెళ్లే మూడు కాలువలపై బ్రిడ్జిలు నిర్మించడం వంటి సమస్యల పరిష్కారానికి,  బిజెపి పార్టీ తరపున తప్పక సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు, కార్యక్రమంలో గ్రామస్తులు గంటా శ్రీనివాసరావు, గుర్రం వెంకటేశ్వర్లు, దావులూరి వెంకట్రామయ్య,గుర్రం వీరయ్య, అధిక సంఖ్యలో గ్రామ మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జనతా వారధి

Axact

ప్రజలకు ప్రభుత్వానికి వారధి - బిజెపి జనతా వారధి

Post A Comment:

0 comments: