జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  వినతి పత్రం సమర్పించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు 


విషయం: రాష్ట్రంలో పడిపోతున్న భూగర్భ జలాలపై తక్షణ చర్యలు చేపట్టి, ఇంకుడుగుంటల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని, ప్రజలతో కలసి మేము మీ దృష్టికి తీసుకొస్తున్న సమస్యలపై చిత్తశుద్ధి కనపరచాలని విజ్ఞప్తి.

ప్రతి శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న “మీ సమస్య – మా బాధ్యత” జనతా వారధి కార్యక్రమంలో ప్రజలతో నిరంతరం చర్చలు జరుపుతున్న సమయంలో భూగర్భ జలాల పరిస్థితిపై అనేక ఆందోళనలు మా దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో 11.05.2026న భూగర్భ జలాల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువచ్చాము. అయితే ఇప్పటివరకు తగిన స్థాయిలో స్పందన కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగర ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టాలు గణనీయంగా పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా నిర్లక్ష్యం కొనసాగితే రాబోయే రోజుల్లో తాగునీరు, వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి వాతావరణ ప్రభావాలు కూడా వర్షపాతం మరియు నీటి లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు అత్యవసరం. జిల్లాలో కనీసం 15 వేల నుంచి 20 వేల ఇంకుడుగుంటలకు Groundwater Recharge Action Plan చేయవలసి ఉన్నది అని తెలుస్తున్నది.

భూగర్భ జలాలు ఒక్కరోజులో ఏర్పడేవి కావు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం, సహజ నీటి వనరులను పరిరక్షించడం, భూగర్భ జలాల వినియోగాన్ని శాస్త్రీయంగా నియంత్రించడం ద్వారా మాత్రమే వాటిని కాపాడుకోగలం.

కావున ప్రభుత్వం తక్షణమే ఈ క్రింది చర్యలు చేపట్టాలని కోరుతున్నాము:
1. జిల్లాల లో భూగర్భ జలాలపై సమగ్ర సర్వే నిర్వహించాలి. అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
2. జిల్లాలో విస్తృతంగా ఇంకుడుగుంటలు ఏర్పాటు చేయాలి. వర్షపు నీటిని వృథాగా కాలువల్లోకి వెళ్లకుండా భూమిలోకి ఇంకేలా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పెద్ద ఎత్తున ఇంకుడుగుంటలు తవ్వించాలి.
3. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, అపార్ట్మెంట్లు, కమ్యూనిటీ బిల్డింగ్స్, భారీ భవనాల్లో ఇంకుడుగుంటలను తప్పనిసరి చేయాలి. కొత్త భవనాలకు అనుమతులు ఇచ్చే సమయంలోనే వర్షపు నీటి సంరక్షణ, రీచార్జ్ వ్యవస్థలు తప్పనిసరి చేయాలి.
4. పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవనాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంకుడుగుంటలు ఏర్పాటు చేయాలి. ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ప్రభుత్వమే సాంకేతిక మరియు ఆర్థిక సహాయం అందించాలి.
5. చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు మరియు ఇతర సహజ నీటి వనరులను పునరుద్ధరించాలి. ఆక్రమణలను తొలగించి వర్షపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి.
6. చెక్‌డ్యామ్‌లు, పెర్కొలేషన్ ట్యాంకులు, రీచార్జ్ పిట్స్ వంటి నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలి.
7. అధికంగా భూగర్భ జలాలను వినియోగించే ప్రాంతాల్లో శాస్త్రీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలి. రైతులకు మైక్రో ఇరిగేషన్, తక్కువ నీటితో సాగయ్యే పంటలు మరియు నీటి పొదుపు పద్ధతులపై అవగాహన కల్పించాలి.

దీనిని ఒక ప్రజా ఉద్యమంగా స్వీకరించాలి. భూగర్భ జలాల పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. ఇది ప్రతి పౌరుడి బాధ్యత. అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా స్వీకరించి, ప్రజలు, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అపార్ట్మెంట్ సంఘాలు మరియు సామాజిక సంస్థలను భాగస్వాములను చేయాలి.

భారతీయ జనతా పార్టీ ప్రజా సేవనే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ పనిచేస్తోంది. భూగర్భ జలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం మరియు అధికారులు చేపట్టే ప్రతి సానుకూల కార్యక్రమానికి మా వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మరియు నిపుణుల సహకారాన్ని కూడా సమన్వయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము.

ఇది రాజకీయ అంశం కాదు — ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన జీవన సమస్య. ఇప్పుడే చర్యలు తీసుకుంటే రేపటి నీటి సంక్షోభాన్ని నివారించగలం. ఆలస్యం చేస్తే భూగర్భ జలాల పునరుద్ధరణ మరింత కష్టతరమవుతుంది.
మా వినతి 

కావున జిల్లా అధికారులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, మండలాల వారీగా తక్షణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, పెద్ద ఎత్తున ఇంకుడుగుంటల నిర్మాణ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము.
ధన్యవాదములతో,

భవదీయులు,
పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్ 
భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా
జనతా వారధి

Axact

ప్రజలకు ప్రభుత్వానికి వారధి - బిజెపి జనతా వారధి

Post A Comment:

0 comments: