ప్రజల వద్ద నుంచి అక్రమంగా నగదు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. 
మల్లెల శివ నాగేశ్వరరావు, బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కన్వీనర్ జనతా వారిది పల్నాడు జిల్లా 
చప్పిడి బాలస్వామి.
చిలకలూరిపేట/ ఫిబ్రవరి 10.
మండలంలోని గొట్టిపాడు గ్రామానికి చెందిన నాగాండ్ల వెంకటరావు, నాగండ్ల వంశీ రాకెట్ ల్యాబ్  అనే ప్రాజెక్టు పేరు తో ప్రజల్ని తప్పుదారి పట్టించి కోకోనట్ అనే పేరుతో కార్యాలయాన్ని పెట్టి కేరళలో వంద ఎకరాలు తోట ఉందని,అక్కడి నుంచి లోడ్ తెచ్చి టాన్స్పోర్ట్ చేస్తున్నామని, ఒక డూప్లికేట్ లైసెన్స్ తయారుచేసి నందిపాడు రోడ్డులో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ఎదురు ఉన్న కార్యాలయంలో  కొబ్బరిబొండాల అమ్ముతున్నట్టు బిల్లులు తయారుచేసి ప్రజల దగ్గర సంతకాలు తీసుకున్నారు. వెంకటరావు అతని పిఏ నిరజా వీళ్ళు కొబ్బరి బోండాల షాపులు పెట్టి క్రయ విక్రయాలు జరుపుతున్నారని, డూప్లికేట్ లైసెన్స్ తయారు చేయించి ప్రజల వద్ద నుంచి విస్తృతంగా వసూళ్లకు పాల్పడ్డారు. ఈ విషయమై సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీకి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, చప్పిడి బాలస్వామి తో పాటు పలువురు బాధితులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన వాటిపై సమగ్రమైన దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ మేరకు జిల్లా ఎస్పీ గ్రామీణ సి.ఐకు బాధితుల ఫిర్యాదును పంపించి న్యాయం చేయాలని ఆదేశించారు.
జనతా వారధి

Axact

ప్రజలకు ప్రభుత్వానికి వారధి - బిజెపి జనతా వారధి

Post A Comment:

0 comments: