*ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది*
*ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ సంయోజిక్ శ్రీ చిరుమామిళ్ల ఆదినారాయణ గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది*
*వచ్చిన పిర్యాదులు*
*నకరికల్లు మండలం నకరికల్లు గ్రామం నుంచి చాట్టు ఏడుకొండలు అనే రైతు తనకు సంబంధించిన 50 సెంట్లు భూమిని ప్రభుత్వ అధికారులు తన 10-1 అడంగల్ నుంచి తొలగించడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది*
*పాల్గొన్న నాయకులు:*
*ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు నరసరావుపేట పార్లమెంటు సంయోజిక్ శ్రీ చిరుమామిళ్ల ఆదినారాయణ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్చార్జి కోమటి వాసు మరియు బిజెపి నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*
*కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట పార్లమెంట్ సంయోజిక్ చిరుమామిళ్ల ఆదినారాయణ గారి చేతుల మీదుగా జనతా వారధికి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే బిజెపి లక్ష్యమని, 'జనతా వారధి' ద్వారా ప్రతి సామాన్యుడికి పార్టీ అండగా ఉంటుందని ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్లమెంటు సంయోజిక్ చిరుమామిళ్ల ఆదినారాయణ గారు తెలిపారు*
Post A Comment:
0 comments: