శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశానిర్దేశం మేరకు,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు,ఈవారం జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేల్పూరు పంచాయతీ పరిధిలోని వెలమ వారి పాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత వంగ నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈనాం భూములకు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని గ్రామంలోని సైడ్ డ్రైనేజీలు నిర్మాణం చేపట్టాలని నిర్మించిన సైడ్ డ్రైనేజీల్లో పూడికతీత తీయాలని,రెండు సంవత్సరాల క్రితం పూర్తిచేసిన గ్రామీణ రక్షిత మంచినీటి పథకం  నిరుపయోగంగా పడఉందని  కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ యొక్క పథకం ట్రయల్ట్రయల్ రన్ తరువాత  ఇంతవరకు త్రాగునీటి సరఫరా చేయలేదని త్రాగునీటి సరఫరా చేయాలని,వేల్పూరునుండి వెలమవారిపాలెం  వెళ్లేటువంటి రహదారి మంజూరుచేసి నెలలు గడుస్తున్న ప్రారంభించలేదని త్వరగా ప్రారంభించాలని, అలాగే వివిధ రకాల పెన్షన్ల కొరకు దరఖాస్తులు వచ్చాయి వీటి పరిష్కారానికి బిజెపి తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేశాం .
జనతా వారధి

Axact

ప్రజలకు ప్రభుత్వానికి వారధి - బిజెపి జనతా వారధి

Post A Comment:

0 comments: