*ఈ వారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సమస్యలపై వినతి పత్రాలు రావడం జరిగింది. వాటి పరిష్కార నిమిత్తం సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటి సమస్యలను పరిష్కరించే నిమిత్తం పల్నాడు జిల్లా జనతా వారిది టీం పని చేస్తుందని వారికి తెలియజేయడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పడకండ్ల లక్ష్మణాచారి ఓబిసి నాయకులు సత్యనారాయణ మండల బిజెపి నాయకులు నాగరాజు మాదిపాడు గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది*
Post A Comment:
0 comments: